Latest Telugu News

News5am, News Headlines Latest Telugu (02-06-2025): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. ఇస్రో వివిధ విభాగాల్లో 320 సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కనీసం 65% మార్కులు లేదా 10లో CGPA 6.84 కలిగి ఉండే ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో BE/B.Tech లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2025 జూన్ 16 నాటికి గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ద్వారా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులను పే మ్యాట్రిక్స్ లెవల్ 10లో సైంటిస్ట్/ఇంజనీర్ ‘SC’ హోదాలో నియమిస్తారు.

ఇతర వివరాల ప్రకారం, ఎంపికైన వారికి నెలకు ప్రారంభ వేతనంగా రూ. 56,100 చెల్లిస్తారు. దరఖాస్తు చేసేటప్పుడు రూ.250 అప్లికేషన్ ఫీజు మరియు రూ.750 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. మహిళలు, SC/ST, దివ్యాంగులు (PwBD), మాజీ సైనికులు రాత పరీక్షకు హాజరైతే పూర్తిగా రూ.750 వాపసు పొందుతారు. పరీక్షకు హాజరయ్యే ఇతర అభ్యర్థులకు రూ.500 పాక్షికంగా రీఫండ్ అవుతుంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 16, 2025లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

More News:

News Headlines Latest Telugu

మోడీని కలిసిన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ..

కాన్వా డౌన్: వేలాది మంది వినియోగదారులు డిజైన్ యాప్‌ యాక్సెస్‌లో సమస్యలు ఎదుర్కొంటున్నారు

More Latest Telugu News: External Sources

B.Tech పాసైతే చాలు.. ఇస్రోలో 320 ఇంజనీర్ జాబ్స్ రెడీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *