నేటి నుండి మూడు రోజుల పాటు ఉత్తర భారతదేశంలో వేడిగాలుల పరిస్థితులు ఉంటాయని IMD హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశాలో వేడిగాలులు వీస్తున్నాయి. ఏప్రిల్ 7 నుంచి 9 వరకు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను మించిపోయే అవకాశం ఉంది. దీని ఫలితంగా, ఆయా రాష్ట్రాల్లో యెల్లో అలర్ట్ జారీ చేయబడి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు.

ఇదిలా ఉంటే రాజస్థాన్‌లోని బార్మె్ర్‌లో కొత్త రికార్డ్‌ను సృష్టించింది. ఆదివారం 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్ మొదటి వారంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే కావడం విశేషం. అంటే సాధారణం కంటే 6.8 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైంది. అలాగే హిమాచల్ ప్రదేశ్, హర్యానా, చండీగఢ్, పంజాబ్, మధ్యప్రదేశ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కూడా వేడిగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *