Power Index: ఆసియాలో అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారత్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఆస్ట్రేలియాలోని లోవీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ‘ఆసియా పవర్ ఇండెక్స్ 2025’లో భారత్ మూడో ర్యాంకు సాధించింది. ఈ ర్యాంకింగ్లు 27 దేశాల శక్తిసామర్థ్యాలను సైనిక, ఆర్థిక, దౌత్య మరియు సాంస్కృతిక ప్రభావం వంటి మొత్తం 8 అంశాల్లోని 131 సూచికల ఆధారంగా నిర్ణయించారు. ఈ ఏడాది భారత్ 40 పాయింట్ల స్కోరుతో మూడో స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, ‘మేజర్ పవర్’ హోదా కూడా పొందింది.
కరోనా తర్వాత భారత్ ఆర్థికంగా బలపడటం, సైనిక శక్తి పెరగడం, భౌగోళిక రాజకీయ ప్రభావం విస్తరించడం వల్ల దేశ శక్తి పెరిగిందని నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో అమెరికా 81.7 స్కోరుతో మొదటి స్థానంలో ఉంటే, చైనా 73.7 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. భారత్ బలంగా ఎదుగుతున్నప్పటికీ చైనాతో ఇంకా వ్యత్యాసం ఉందని తేలింది. అదేవిధంగా 2019 తర్వాత రష్యా శక్తి తిరిగి పెరగడం, జపాన్ స్థిరంగా ఉండటం, ఆగ్నేయాసియా దేశాలు స్వల్ప పురోగతిని సాధించడం కూడా నివేదికలో ప్రస్తావించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మళ్లీ పెరిగిన బంగారం–వెండి ధరలు: హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇదే!
భారీ లేఆఫ్స్ ప్రభావం – సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే పెద్ద దెబ్బ.. 40% టెకీ పోస్టులు ఖాళీ!
External Links:
పవర్ ఇండెక్స్లో మూడో స్థానానికి భారత్.. ఆ రెండు దేశాల తర్వాత..!