Ranganathan Arrest: చిన్నారుల మరణాలకు కారణమైన దగ్గు మందు ఘటన తీవ్ర ఆందోళన రేపింది. మధ్యప్రదేశ్లో “కోల్డ్రిఫ్” దగ్గు సిరప్ తాగిన పలువురు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. తాజాగా ఈ కేసులో పోలీసులు పెద్ద ముందడుగు వేశారు. SRESAN MEDICALS యజమాని రంగనాథన్ను అదుపులోకి తీసుకున్నారు. కలుషితమైన కోల్డ్రిఫ్ సిరప్ వల్ల 20 మంది చిన్నారులు మరణించిన నేపథ్యంలో పోలీసులు ఆయనను విచారిస్తున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా కంపెనీ యజమానులను పట్టించేందుకు రూ.20,000 బహుమతిని ప్రకటించగా, SIT బృందం ఏర్పాటుతో రంగనాథన్ అరెస్ట్ అయ్యాడు.
ఇక ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి నరేంద్ర శివాజీ పటేల్ స్పందించారు. రాష్ట్రంలో 20 మంది పిల్లలు చనిపోవడానికి తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన అన్నారు. “తమిళనాడు నుంచి బయలుదేరే మందులను పరీక్షించడం అక్కడి ప్రభుత్వ బాధ్యత. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేవలం యాదృచ్ఛిక పరీక్షలు మాత్రమే చేస్తుంది. కానీ ఈ సిరప్ పరీక్షలో పడలేదు,” అని ఆయన స్పష్టం చేశారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మూడు దగ్గు మందులను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం…
భౌతిక శాస్త్రంలో ముగ్గురిని వరించిన నోబెల్ బహుమతి…
External Links:
20 మంది చిన్నారులను బలిగొన్న దగ్గు సిరప్ కంపెనీ యజమాని అరెస్ట్..