Telangana Rising Global Summit 2025

Telangana Rising Global Summit 2025: డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 కు దేశాల నుంచి, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, నిపుణులు, విద్యావేత్తలు వస్తున్నారు. రెండు రోజులపాటు 27 ప్రత్యేక చర్చలు ఉంటాయి. ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ–సెమీకండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బన్ ఇన్‌ఫ్రా, వ్యవసాయం, పరిశ్రమలు, స్టార్టప్‌లు, మహిళా వ్యాపారవేత్తలు వంటి అనేక రంగాలపై చర్చలు జరుగుతాయి. WHO, వరల్డ్ బ్యాంక్, ADB, UNICEF తో పాటు Micron, Hitachi Energy, Apollo Hospitals, IIT Hyderabad, NASSCOM, Skyroot, Amul, GMR, Tata Realty, Swiggy, AWS వంటి ప్రధాన సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతారు.

పివి సింధు, అనిల్ కుంబ్లే, గోపిచంద్ వంటి క్రీడా ప్రముఖులు ‘Olympic Gold Quest’ సెషన్‌లో పాల్గొంటారు. రాజమౌళి, సుకుమార్, గుణీత్ మోంగా వంటి సినీ ప్రముఖులు ‘Creative Century’ చర్చలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. డిసెంబర్ 9న ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ విడుదల చేస్తుంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రణాళికలు, పెట్టుబడులు, టెక్నాలజీ భాగస్వామ్యాలు ఈ డాక్యుమెంట్‌లో ఉంటాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

మళ్లీ పెరిగిన బంగారం–వెండి ధరలు: హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇదే!

భారీ లేఆఫ్స్‌ ప్రభావం – సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకే పెద్ద దెబ్బ.. 40% టెకీ పోస్టులు ఖాళీ!

External Links:

అంగరంగ వైభవంగా అంతర్జాతీయ వేడుక.. గ్లోబల్ సదస్సుకు ప్రపంచ నేతలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *