ఈ మధ్యకాలంలో ఆర్టీసీ ఉద్యోగులపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి. తాజాగా విద్యానగరలో ఓ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే టీజీఆర్టీసీ దిల్సుఖ్నగర్ డిపోకు చెందిన బస్సు సికింద్రాబాద్ నుంచి ఎల్బీనగర్కు వెళ్తోంది. విద్యా నగర్ బస్ స్టాప్ వద్ద మూలాన నిల్చున్న ఓ మహిళ బస్సును ఆపమని డ్రైవర్కు సిగ్నల్ ఇచ్చింది. కాస్త ముందుకు పోనిచ్చిన డ్రైవర్ రోడ్డు పక్కగా ఆపేందుకు ప్రయత్నించాడు. ఆ మహిళ డ్రైవర్ బస్సు ఆపడంలేదని కోపంతో బీరు బాటిల్ విసిరి వెనుక అద్దాన్ని పగులగొట్టింది. బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపిన వెంటనే, కండక్టర్ ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించగా, ఆ మహిళ అకస్మాత్తుగా తన బ్యాగ్లోంచి పామును బయటకు తీసి కండక్టర్పైకి విసిరింది.
ప్రాణభయంతో కండక్టర్ పరుగులు తీసింది. పాము కిందపడి రోడ్డు పక్కన కనిపించకుండా పోయింది. ఈ ఘటన నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో జరగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటనను తమ మొబైల్ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీశారు. టీజీఆర్టీసీ అధికారులు నల్లకుంట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. నిందితురాలు బ్యాగులో పామును ఎందుకు తీసుకెళ్లిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
.