Yellow Alret to Hyderabad: గ్రేటర్లో శనివారం, ఆదివారం, సోమవారం మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించగా, అధికారులు వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో సిబ్బందిని నియమించి డ్రైనేజీ, వరద నివారణ చర్యలు చేపట్టారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది.
ఉస్మాన్సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తుతం 1789.85 అడుగుల వద్ద ఉంది. దీంతో అధికారులు 8 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని ముసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 900 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 2,704 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, 1763.10 అడుగుల వద్ద ఉండటంతో 2 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇక్కడ ఇన్ఫ్లో 1,800 క్యూసెక్కులు, ఔట్ఫ్లో 2,300 క్యూసెక్కులుగా ఉంది.
Internal Links:
PF ఖాతాదారులకు గుడ్న్యూస్, 3.0 వచ్చేస్తోంది..
రాబోయే 3 గంటల్లో భారీ వర్షాలు..
External Links:
గ్రేటర్ హైదరాబాద్కు ఎల్లో అలెర్ట్ జారీ.. సిటీలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు