టోలీచౌకిలోని సక్సెస్‌-ది హైస్కూల్‌ విద్యార్థి మహ్మద్‌ అహిల్‌(6) మంగళవారం ఎల్‌బీ స్టేడియంలో పాఠశాలలో నిర్వహించిన క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు వెళ్లాడు.ఎల్ బీ స్టేడియంలో మంగళవారం సాయంత్రం సంపులో పడి కిండర్ గార్టెన్ విద్యార్థి మృతి చెందాడు.అతనితో పాటు అన్నయ్య ఆదిల్, తల్లి సఫియా ఉన్నారు. క్రీడాపోటీలు జరుగుతుండగా స్టేడియంలో బాలుడు అదృశ్యమయ్యాడు.

రెండు గంటల పాటు విస్తృతంగా వెతకగా, స్టేడియంలో 12 అడుగుల లోతులో ఉన్న నీటి సంప్‌లో బాలుడు కనిపించాడు. బాలుడిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు పాఠశాల యాజమాన్యం, ఎల్‌బీ స్టేడియం యాజమాన్యం కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తూ సంప్‌పై కవర్‌ సరిగ్గా అమర్చలేదని ఆరోపిస్తూ చిన్నారి కాలుజారి నీటిలో మునిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *