కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్సభలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది మరియు తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒకవైపు ఏపీకి రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల నిధులు కేటాయించారు, కానీ తెలంగాణకు హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి అత్తెసరు నిధులను మినహాయించడం మరెక్కడా లేదు. గత 10 ఏళ్లుగా ప్రతి బడ్జెట్లోనూ తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపింది. ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మళ్లీ భంగపాటే ఎదురైంది.