Fighter Jet Crashes: రాజస్థాన్ రాష్ట్రం చురు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ జూలై 9, 2025 మధ్యాహ్నం 1 గంట సమయంలో పంట పొలాల్లో కుప్పకూలి పేలిపోయింది. ఈ ఘటనలో విమానం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. దురదృష్టవశాత్తు పైలెట్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానికులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలికి చేరుకుని ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే భారత ఆర్మీ ఉన్నతాధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఫైటర్ జెట్ శకలాలు చెల్లాచెదురుగా పడి ఉండగా, ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన జాగ్వార్ విమానమని అధికారులు స్పష్టం చేశారు. అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి ప్రమాదానికి గల కారణాలను వెల్లడించే అవకాశం ఉంది.
Internal Links:
నేడు పలు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన..
ఎయిర్పోర్టుల వద్ద నిర్మాణాలపై ఉక్కుపాదం..
External Links:
రాజస్తాన్ లో కుప్పకూలి పేలిపోయిన ఆర్మీ ఫైటర్ జెట్