Historic Vande Mataram Debate In Lok Sabha: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1 నుంచి 19 వరకు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోడీ ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవంపై ప్రత్యేక చర్చను ప్రారంభించనున్నారు. ఈ చర్చలో గీతంలోని ముఖ్యాంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే మోడీ మరోసారి కాంగ్రెస్పై విమర్శలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వందేమాతరంపై మొత్తం 10 గంటలు చర్చకు కేటాయించగా, ప్రధాని తర్వాత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అనంతరం పలు కాంగ్రెస్ ఎంపీలు ప్రసంగించనున్నారు. రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభిస్తారు.
వందేమాతరం గీతాన్ని బంకిం చంద్ర ఛటర్జీ 1875లో ప్రచురించగా, 1905లో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో ఇది ప్రజల్లో జాతీయ భావాన్ని రగిలించింది. స్వాతంత్ర్య సమరయోధులను ఏకం చేసిన ఈ గీతాన్ని 1950లో జాతీయ గీతంగా ప్రకటించారు. ఇటీవల కేంద్రం 150వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం పార్లమెంట్లో ‘SIR’ అంశంపై విపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ‘వందేమాతరం’పై చర్చ సజావుగా సాగుతుందా లేదా నిరసనలు కొనసాగుతాయా అన్నది చూడాలి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
పార్లమెంట్లో నేడు ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభించనున్న మోడీ