జమ్మూ కాశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌లో జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ జ‌వాన్ మృతిచెందారు. ఉగ్రవాదులు అక్కడ ఉన్నారనే విశ్వసనీయ సమాచారం ఆధారంగా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేప‌ట్టాయి. ముష్కరులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాన్ అమరుడయ్యాడని భద్రతా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అక్కడ భీకర ఎన్‌కౌంటర్ జరుగుతోంది. బేక్ క్యాంపుల నుండి పెద్ద సంఖ్యలో అదనపు బలగాలను ఆర్మీ అధికారులు సంఘటనా స్థలానికి తరలిస్తున్నారు.

మరోవైపు, కాశ్మీర్ పర్యాటక రంగాన్ని కాపాడేందుకు కేంద్రం చర్యలను ముమ్మరం చేసింది. తాజా ఉగ్రవాద దాడి నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలలో భద్రత ఆవశ్యకత గురించి సీనియర్ అధికారులు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు. దానితో, అన్ని ప్రధాన పర్యాటక ప్రాంతాలలో శాశ్వతంగా సైన్యం మరియు పారామిలిటరీ దళాలను మోహరించాలని నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *