CM Chandrababu Visits Native Village For Sankranti

CM Chandrababu Visits Native Village For Sankranti: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు నారావారిపల్లెలో పర్యటిస్తున్నారు. ఉదయం 8 గంటలకు టీటీడీ కళ్యాణ మండపంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.140 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, రూ.20 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం చేయనున్నారు. కృష్ణా జలాలను చంద్రగిరి ప్రాంతానికి తీసుకువచ్చే ప్రాజెక్టుకు మూలపల్లి చెరువు వద్ద రూ.126 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం శేషాచల లింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి, ఆలయానికి వెళ్లే కొత్త రహదారిని ప్రారంభిస్తారు.

నారావారిపల్లెలో 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్‌స్టేషన్, రూ.1.4 కోట్ల స్కిల్ బిల్డింగ్ సెంటర్‌ను సీఎం ప్రారంభిస్తారు. సంజీవని ప్రాజెక్టులకు శుభారంభం చేయనున్నారు. తిరుపతిలో రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్మించిన పేషెంట్ అమీనిటీస్ కాంప్లెక్స్‌ను, ఎస్వీ యూనివర్సిటీలో కొత్త బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లను ప్రారంభిస్తారు. అలాగే పశువుల వసతి సముదాయం, పరిశోధనా ల్యాబ్స్‌, అకడమిక్ బిల్డింగ్ విస్తరణ, కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం

సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో

External Links:

సంక్రాంతి సంబరాల కోసం స్వగ్రామానికి సీఎం.. నాలుగు రోజులు ఊర్లోనే చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *