house Arrest

House Arrest: ఆర్టీసీ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ “చలో బస్ భవన్” కార్యక్రమం ప్రకటించింది. ఉదయం 8.45కు రేతిబౌలి నుంచి బస్ భవన్‌ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని కేటీఆర్, తలసాని, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు నిర్ణయించారు. అయితే ముందుగానే పోలీసులు జాగ్రత్తలు తీసుకుని బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా కేటీఆర్, హరీష్‌రావు సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల చర్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. “మేము కేవలం శాంతియుతంగా ఆర్టీసీ ఎండీకి లేఖ ఇవ్వాలనుకున్నాం. ఛార్జీలను తగ్గించమని కోరాలని నిర్ణయించాం. కానీ ప్రభుత్వం మా ఇళ్ల ముందే పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది. బస్సు ఎక్కకుండా అడ్డుకోవడానికి ఇంతమంది పోలీసులు అవసరమా? పోలీసులు ఇదే ఉత్సాహం హైదరాబాద్‌లో నేరాల నియంత్రణలో చూపితే మంచిది. ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆర్టీసీ ఛార్జీల తగ్గింపువరకు మా నిరసన కొనసాగుతుంది. ఇలాంటి చర్యలు మాకు కొత్త కాదు,” అని ఆయన అన్నారు.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కోటా పై నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం…

నేడు రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ…

External Links:

ఉద్రిక్తత.. హరీష్‌రావు, కేటీఆర్ హౌస్ అరెస్ట్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *