ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటి నుంచి తెలంగాణ అభివృద్ధికి ప్రపంచ పెట్టుబడులు అవసరమని గట్టిగా చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం నేడు జపాన్ కు బయలుదేరనుంది. నేటి (ఏప్రిల్ 16) నుండి 22వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో, టోక్యో, మౌంట్ ఫుజి, ఒసాకా, హిరోషిమా నగరాల్లో రేవంత్ రెడ్డికి మద్దతు ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ కూడా పాల్గొంటారు. సీఎం రేవంత్ గతంలో పెట్టుబడుల కోసం దావోస్‌లో జరిగిన ఆర్థిక సదస్సులో పాల్గొని అనేక పెట్టుబడులు అందుకున్నారు.

టోక్యోలోని వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవుతున్నారు. ఏప్రిల్ 17న తోషిబా ఫ్యాక్టరీని సందర్శించి కంపెనీ కార్యకలాపాలపై అవగాహన పొందనున్నారు. ఏప్రిల్ 18న గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, టోక్యో గవర్నర్‌తో సమావేశం, పారిశ్రామికవేత్తలతో రౌండ్‌టేబుల్ సమావేశం జరపనున్నారు. ఆ తర్వాత ప్రముఖ కంపినీలైన టొయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టీటీ సంస్థల సీఈఓ లతో వరుస భేటీలు షెడ్యూల్ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *