Kavitha gets Emotional: సోమవారం (జనవరి 5) శాసనమండలిలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబం, పార్టీ నుంచి తనకు మద్దతు లేకపోయిందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడం తగదని, గత ఎనిమిదేళ్లుగా తన పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నాలు జరిగాయని అన్నారు. తెలంగాణ ప్రజలను నిరుత్సాహపరచకుండా పేదల మధ్యే ఉండి పనిచేశానని, బీడీ కార్మికులు, అంగన్వాడీ, జీహెచ్ఎంసీ కార్మికుల సమస్యలకు సహాయం చేశానని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ తనకు ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదని, పార్టీ మీడియా కూడా సహకరించలేదని కవిత అన్నారు. ప్రశ్నించినందుకే తనను పార్టీ నుంచి దూరం చేశారని ఆరోపించారు. 2014 నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని, పార్టీలో అవినీతిని కేసీఆర్కు తెలిపానని చెప్పారు. సిరిసిల్ల, సిద్ధిపేట, కలెక్టరేట్ నిర్మాణాల్లో అవినీతి జరిగిందని, ఉద్యమ కారులను బీఆర్ఎస్ మోసం చేసిందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో కూడా పార్టీ విఫలమైందని కవిత పేర్కొన్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం
సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో
External Links:
ఏ ఒక్కరు నాకు మద్దతివ్వలేదు… మండలిలో కంటతడి పెట్టిన కవిత..