హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటన ముగిసింది. శనివారం ఉదయం విదేశీ పర్యటన ముగించుకుని కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. రెండు వారాల అమెరికా పర్యటన తర్వాత ఆయన హైదరాబాద్కు వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేటీఆర్ నేరుగా నందినగర్ వెళ్లారు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లాడు.
కాగా, ఇవాళ కొండాపూర్లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి కేటీఆర్ వెళ్లనున్నారు. ఇటీవల జరిగిన పరిణామాల గురించి వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో మధ్యాహ్నం 2 గంటలకు మాజీ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారి సతీమణి అనారోగ్యంతో ఇటీవల మరణించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.