మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. అతను తన కుటుంబంతో కలిసి జపాన్ వెళ్ళాడు. వాళ్ళు అక్కడి అందాలను ఆస్వాదిస్తూ, కుటుంబంతో సమయం గడుపుతున్నారు.

వారు జపాన్‌లోని వివిధ నగరాల్లో పర్యటిస్తున్నారు. తాజాగా బుల్లెట్ ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కడానికి ముందు ఆయన బుల్లెట్ ట్రైన్ ముందు పోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక ప్రజలతో కూడా ఫొటోలు దిగుతూ మల్లారెడ్డి సందడి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *