ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భద్రాచలం పర్యటన రద్దయింది. రేపు శ్రీరామ నవమి సందర్భంగా సీత, రాముల వివాహానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కావాల్సి ఉంది. ఆయన హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సాయంత్రం 5 గంటలకు రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. రాత్రికి భద్రాచలంలో బస చేసి రేపు స్వామివారి కళ్యాణానికి హాజరు కానున్న పవన్ కళ్యాణ్ గారు, ప్రభుత్వం తరపున సీతారాములకి ముత్యాల తలంబ్రాలను సమర్పించాల్సి ఉంది.

అయితే, పవన్ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీకి సమాచారం అందింది. తన పర్యటన వల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, ఈ నెల 11న ఒంటిమిట్టలో కోదండరాములవారి కళ్యాణోత్సవం జరగనుంది. ఏపీ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *