లోక్సభలో ప్రతిపక్ష నేత, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఫిర్యాదు మేరకు తన అధికారిక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను తొలగించారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులను సెలెక్టివ్ సెన్సార్షిప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
గురువారం తన కుటుంబం, స్నేహితులు, కార్యకర్తలు, మద్దతుదారుల సోషల్ మీడియా ఖాతాలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేయడం, దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఖాతాలను తొలగించడం దురదృష్టకరమని అన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు చెందిన రెండు ఫేస్బుక్ ఖాతాలు, మూడు ఇన్స్టాగ్రామ్ ఖాతాలను మెటా తొలగించింది. దీనిపై రాజాసింగ్ స్పందించారు.