ఆదివారం ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద పారింది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ బ్యాటర్లు బౌండరీలతో అభిమానులను ఉత్సాహపరిచారు. బాల్.. బాల్కు ఈలలు, కేరింతలతో స్టేడియం హోరెత్తింది. ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, క్లాసెన్ బలమైన ఇన్నింగ్స్లతో రాజస్థాన్ 286 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు.
ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో ఇదే అత్యధిక స్కోర్. తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన రాజస్థాన్ బ్యాటర్లు కూడా బౌండరీలు బాదారు. కానీ వారు ఆ భారీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. చాలా రోజుల తర్వాత మంచి మ్యాచ్ చూసినందుకు క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.