Silver and Gold Prices today: ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు వరుసగా పెరిగి లక్షా 35 వేలకు చేరి, తర్వాత క్రమంగా తగ్గి లక్షా 22 వేలకు చేరాయి. అయితే మళ్లీ పసిడి ధరలు పెరుగుతూ షాక్ ఇస్తున్నాయి. నవంబర్ 10, 11 తేదీల్లో భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు, నిన్న స్వల్పంగా తగ్గినా, ఈరోజు మళ్లీ గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం రూ.229 పెరిగి రూ.12,780కి, 22 క్యారెట్ల 1 గ్రాము రూ.210 పెరిగి రూ.11,715కి చేరింది. 10 గ్రాముల రేట్లు వరుసగా రూ.1,27,800 (24 క్యారెట్లు) మరియు రూ.1,17,150 (22 క్యారెట్లు)గా ఉన్నాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
ఇక వెండి ధరలు కూడా ఊహించని విధంగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ.10,000 పెరిగి రూ.1,72,000గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడల్లో కిలో వెండి ధర రూ.1,82,000గా ఉంది. ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రఫేల్ ఫైటర్ జెట్లో గగన విహారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పు – ఎమ్మెల్సీ అజారుద్దీన్కి మంత్రి పదవి దక్కింది
External Links:
ఊహించని షాక్.. బంగారంపై రూ.2290, వెండిపై రూ.10000!