Cyclone Senyar Heading South India: దక్షిణాదిపై మరో తుఫాన్ ముప్పు ఎదురవుతోంది. మలక్కా జలసంధిపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ‘సన్యార్’ తుఫానుగా బలపడిందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ తుఫాన్ 24 గంటలపాటు బలం కొనసాగిస్తుందని, అనంతరం క్రమంగా బలహీనపడతుందని అంచనా వేసింది. తమిళనాడు, కేరళ, మాహే, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్, యానాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, రామనాథపురం, నాగపట్నం జిల్లాల్లో కురిసిన వర్షాలతో వరదస్థితి నెలకొంది.
నవంబర్ 23–28 మధ్య అండమాన్–నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, 24 గంటల్లో 105–204 మి.మీ. వర్షం కురవచ్చని అంచనా చేశారు. గాలి వేగం గంటకు 35–45 కి.మీ. వరకు ఉంటుందని తెలిపారు. ఈ సమయంలో సముద్రం ప్రక్షుబ్ధంగా ఉండే అవకాశం ఉండటంతో మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని అధికారుల హెచ్చరిక. నవంబర్ 28 వరకు హెచ్చరికలు అమల్లో ఉంటాయని, తక్కువ నేలమట్టం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
మళ్లీ పెరిగిన బంగారం–వెండి ధరలు: హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇదే!
భారీ లేఆఫ్స్ ప్రభావం – సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే పెద్ద దెబ్బ.. 40% టెకీ పోస్టులు ఖాళీ!
External Links:
దక్షిణాది వైపు దూసుకొస్తున్న సెన్యార్ తుఫాను.. భారీ వర్షాలు కురిసే ఛాన్స్