Hayathnagar Accident

Hayathnagar Accident: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థిని యంసాయని ఐశ్వర్య (22) అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో ఆమె తండ్రి పాండు తీవ్రంగా గాయపడ్డారు. మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదువుతున్న ఐశ్వర్య వైద్యురాలై ప్రజలకు సేవ చేయాలన్న ఆశలు ఈ ప్రమాదంతో అర్ధాంతరంగా ముగిశాయి.

వివరాల ప్రకారం, ఐశ్వర్య తన తండ్రితో కలిసి హయత్‌నగర్ ఆర్టీసీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరినీ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, ఐశ్వర్య అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఆమె తండ్రిని మరో ఆసుపత్రికి తరలించారు. ఐశ్వర్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌పై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

మళ్లీ పెరిగిన బంగారం–వెండి ధరలు: హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇదే!

భారీ లేఆఫ్స్‌ ప్రభావం – సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకే పెద్ద దెబ్బ.. 40% టెకీ పోస్టులు ఖాళీ!

External Links:

తండ్రి కళ్లెదుటే ప్రాణాలు విడిచిన కుమార్తె.. హయత్‌నగర్‌లో విషాదం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *