Telangana Weather: తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతంలో ఏర్పడిన మరో ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారిందని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ వంటి జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బుధ, గురువారాల్లో కూడా తేలికపాటి జల్లులు కొనసాగవచ్చని అంచనా. ఇప్పటికే జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, ఖమ్మం, కొత్తగూడెం తదితర జిల్లాల్లో స్వల్ప వర్షాలు నమోదైనట్లు టీజీడీపీఎస్ తెలిపింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
SSC GD 2025 ఫలితాలు ssc.gov.in లో విడుదల అయ్యాయి.
External Links:
తెలంగాణకు మూడు రోజుల వర్ష సూచన