Shashi Tharoor Meet With Rahul Gandhi: త్వరలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపడుతోంది. చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉన్న తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ను మళ్లీ దగ్గరకు తీసుకురావాలని అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో శశిథరూర్ భేటీ అయ్యారు. పార్టీతో ఉన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.
ఇటీవల తిరువనంతపురంలో జరిగిన కాంగ్రెస్ సీనియర్ల సమావేశానికి శశిథరూర్ హాజరు కాకపోవడంతో విభేదాలపై చర్చ సాగింది. తన సమస్యలను పరిష్కరించాలని ఆయన లేఖ రాయగా, సీనియర్లు కూడా హైకమాండ్కు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా శశిథరూర్ పార్టీకి దూరంగా ఉండటంతో పార్టీ మారుతారనే ప్రచారం సాగినా, రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఆ వదంతులకు ముగింపు పడినట్లు అయింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
జోర్డాన్లో ప్రధాని మోడీ పర్యటన…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబిన్..
External Links:
పార్టీ మార్పు వేళ కీలక పరిణామం.. రాహుల్గాంధీతో శశిథరూర్ భేటీ