Telangana Delegation Wef Annual Meet

Telangana Delegation Wef Annual Meet: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) వార్షిక సదస్సు–2026లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందానికి అక్కడ ప్రవాస తెలంగాణవాసులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఇదిలా ఉండగా, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్‌కు చేరుకున్నారు. దావోస్‌లో నాలుగు రోజుల పాటు జరిగే WEF సమావేశాల్లో తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొననుంది.

సదస్సు తొలి రోజున సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్‌మ్యాప్‌ను పరిచయం చేయనున్నారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం గురించి వివరించనున్నారు. గత డిసెంబర్‌లో ప్రభుత్వం విడుదల చేసిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా సుస్థిర పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ఉంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

మంత్రిగా రవీంద్ర జడేజా భార్య ప్రమాణం

సీఎం భూపేంద్ర పటేల్ మినహా గుజరాత్ మంత్రులందరూ రాజీనామా చేశారుసుప్రీంకోర్టులో

External Links:

వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సుకు తెలంగాణ ప్రతినిధి బృందం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *