Smriti Mandhana: టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన సంగీత దర్శకుడు ప్రియుడు పలాశ్ ముచ్చల్తో నిశ్చితార్థం జరిగిందని పరోక్షంగా వెల్లడించింది. సహచర ఆటగాళ్లతో కలిసి చేసిన ఇన్స్టా రీల్లో తన వేలికి ఉన్న నిశ్చితార్థం ఉంగరాన్ని చూపిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సమాచారం బయటికొచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పీఎంఓ పంపిన సందేశం ప్రకారం ఈ నెల 23న వీరి వివాహం జరగవచ్చని తెలుస్తోంది. అయితే ఈ తేదీపై స్మృతి లేదా పలాశ్ అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. కొంతకాలంగా వారు ప్రేమలో ఉన్నారని, పలాశ్ స్మృతి మ్యాచ్లకు హాజరై ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చారని తెలిసిందే.
స్మృతి మంధాన ఇటీవలి మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శనతో వార్తల్లో నిలిచింది. మహిళల వన్డే ప్రపంచకప్లో 434 పరుగులు చేసి భారత విజయానికి కీలకంగా నిలిచింది. అలాగే మహిళల ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీకి కెప్టెన్గా తొలి టైటిల్ అందించింది. ఆమె నిశ్చితార్థం వార్త తెలిసిన వెంటనే సహచర క్రికెటర్లు, సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రఫేల్ ఫైటర్ జెట్లో గగన విహారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పు – ఎమ్మెల్సీ అజారుద్దీన్కి మంత్రి పదవి దక్కింది
External Links:
నిశ్చితార్థం చేసుకున్న స్మృతి మంధాన…