Wednesday Gold and Silver Rates: భారతీయులు ఎప్పటిలాగే బంగారం, వెండిని ఇష్టపడుతుంటారు. కానీ ఇటీవల ఈ రెండు లోహాల ధరలు నిరంతరం పెరుగుతుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు 3,500 డాలర్లు, వెండి ఔన్సు 40 డాలర్లకు చేరుకోవడంతో నిపుణులు చెప్పినట్లే ధరల ర్యాలీ కొనసాగుతోంది. దీనికి గ్లోబల్ రాజకీయ పరిస్థితులు, అమెరికా సమస్యలు ప్రధాన కారణాలు. ఈ పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు బంగారం కొనుగోలు చేసేటప్పుడు రేట్లు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.10,697గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.9,805గా ఉంది.
బంగారంతో పాటు వెండి కూడా పెరుగుదల దిశగా దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 3న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వెండి కేజీ ధర రూ.900 పెరిగి రూ.1,37,000కు చేరుకుంది. దీంతో గ్రాము వెండి ధర రూ.137గా ఉంది. అంటే బంగారం, వెండి ధరలు రెండూ వారాంతంలో గణనీయంగా పెరిగి, కొనుగోలుదారులకు భారంగా మారాయి.
Internal Links:
కొత్త నెల తొలిరోజున పెరిగిన గోల్డ్ సిల్వర్..
ఓరి దేవుడా, బంగారం కొనేదెట్టా..
External Links:
నిరంతరం పెరుగుతున్న గోల్డ్-సిల్వర్.. ఏపీ తెలంగాణ రేట్లివే..