Donald Trump India Visit: భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలు మరింత బలపడనున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. 2027 ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్నారని చెప్పారు. ఈ పర్యటన ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు, ఇరు దేశాల మధ్య పెండింగ్లో ఉన్న ట్రేడ్ డీల్ను త్వరగా పూర్తి చేసేందుకు తాను కూడా భారత్కు రానున్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు ట్రంప్ల మధ్య ఉన్న మంచి వ్యక్తిగత సంబంధాలే ఇరు దేశాల బలమైన స్నేహానికి కారణమని ఆయన అన్నారు. అలాగే మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచ స్థాయిలో మరింత బలమైన దేశంగా ఎదిగిందని ప్రశంసించారు.
భారత్-అమెరికా భాగస్వామ్యం రాబోయే రోజుల్లో మరింత బలపడుతుందని రూబియో ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో అత్యంత కఠినమైన హెవీ క్రూడ్ ఆయిల్ను శుద్ధి చేసే సామర్థ్యం ఉన్న దేశాల్లో భారత్ ఒకటని చెప్పారు. ముడి చమురు సరఫరా పెంచేందుకు భారత్, అమెరికా, వెనిజులా కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. మరోవైపు, భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ, ఇరు దేశాలు సహజ భాగస్వాములని, ట్రేడ్ డీల్ చర్చలు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. కొత్త అమెరికా వీసా విధానం భారత్ను లక్ష్యంగా చేసుకుని తీసుకురాలేదని స్పష్టం చేశారు. అలాగే మోడీ, ట్రంప్ల మధ్య ఉన్న మంచి సంబంధాల వల్లే ఇరు దేశాల బంధం మరింత బలపడుతోందని తెలిపారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
ఉద్యోగులకు అలర్ట్.. ఈపీఎఫ్ఓ సేవలు 4 రోజులు బంద్!