ఇప్పటి వరకు బ్లాక్బస్టర్స్ మాత్రమే చేసిన అనిల్ రావిపూడి వెంకటేష్తో కలిసి ఒక ప్రత్యేకమైన ట్రయాంగిలర్ క్రైమ్ ఎంటర్టైనర్ కోసం జతకట్టనున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్లు కథానాయికలు. ఈ మూడు పాత్రల చుట్టూనే కథ తిరుగుతుంది. ఇది అతని ట్రేడ్ మార్క్ కామెడీని కలిగి ఉన్నప్పటికీ, ఇది సాధారణ అనిల్ రావిపూడి మార్క్ సినిమా కాదు. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రం ఈరోజు హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అల్లు అరవింద్ కెమెరా స్విచాన్ చేయగా, ముహూర్తం షాట్కు సురేష్ బాబు క్లాప్ కొట్టారు. కె రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. వంశీ పైడిపల్లి స్క్రిప్ట్ని మేకర్స్కి అందజేశారు.
దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. లెన్స్మెన్గా సమీర్రెడ్డి, ఎడిటర్గా తమ్మిరాజు ఉన్నారు.