Stock Market in loss: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ప్రారంభం నుంచే అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ 84,750 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై, రోజంతా ఒడిదుడుకులకు లోనైంది. ఇంట్రాడేలో గరిష్ఠంగా 84,906 పాయింట్లకు చేరినా, కనిష్ఠంగా 84,312 పాయింట్లకు పడిపోయింది. చివరకు 592 పాయింట్లు తగ్గి 84,404 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 176 పాయింట్లు కోల్పోయి 25,877 వద్ద నిలిచింది. మొత్తం ట్రేడింగ్లో 1,808 షేర్లు లాభపడగా, 2,167 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.1 శాతం తగ్గాయి. ముఖ్యంగా హెల్త్కేర్, ఫైనాన్షియల్, ఫార్మా రంగాలు ఎక్కువగా నష్టపోయాయి.
ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంకులు 0.7 శాతం తగ్గగా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలు స్వల్పంగా పడిపోయాయి. రియాల్టీ రంగం మాత్రం 0.13 శాతం లాభపడింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆయిల్, గ్యాస్ సూచీలు స్వల్పంగా తగ్గాయి. నిఫ్టీలో కోల్ ఇండియా, లార్సెన్, భారత్ ఎలక్ట్రికల్స్, హిందాల్కో, నెస్లే, మారుతి సుజుకీ, టీఎంపీవీ, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, జేఎస్డబ్ల్యూ సిమెంట్ లాభపడ్డాయి. అయితే డాక్టర్ రెడ్డీస్, సిప్లా, హెచ్డీఎఫ్సీ లైఫ్, భారతి ఎయిర్టెల్, ఇంటర్గ్లోబ్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
LG ఎలక్ట్రానిక్స్ షేరు ధర IPO ధర కంటే 51% పెరిగింది..
External Links:
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 600 పాయింట్లు పతనమైన సెన్సెక్స్..!