News5am, Telugu Crime Buzz (19-05-2025): రూ. 6,200 కోట్లకు పైగా విలువైన బ్యాంక్ రుణాల మోసం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై యూకో బ్యాంక్ మాజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ గోయెల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసినట్లు సోమవారం ప్రకటించింది. కోల్కతాకు చెందిన కాంక్యాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ (CSPL) కంపెనీకి సంబంధించిన కేసులో ఈ అరెస్ట్ జరిగింది.ఈడీ అధికారులు మే 16న సుబోధ్ కుమార్ గోయెల్ను ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. మే 17న కోల్కతాలోని ప్రత్యేక ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కోర్టులో హాజరుపరచగా, మే 21 వరకు ఈడీ కస్టడీ విధించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దర్యాప్తులో భాగంగా ఏప్రిల్లో గోయెల్తో పాటు మరికొందరి నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.
సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తోంది. CSPL సంస్థకు క్రెడిట్ సౌకర్యాలు మంజూరు చేయడం, ఆ తర్వాత రూ. 6,210.72 కోట్లకు పైగా రుణాలను పెద్ద ఎత్తున మళ్లించడం, దుర్వినియోగం చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. గోయెల్ యూకో బ్యాంక్ CMDగా ఉన్న సమయంలోనే CSPLకి భారీ ఎత్తున క్రెడిట్ సౌకర్యాలు మంజూరయ్యాయని, వాటిని ఆ తర్వాత లబ్ధిదారులు మళ్లించి, దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపించింది. దీనికి ప్రతిఫలంగా గోయెల్ CSPL నుండి “గణనీయమైన అక్రమ ప్రయోజనాలు” పొందారని ఈడీ తెలిపింది.
More Latest Buzz:
Telugu Crime Buzz News:
కాల్పుల విరమణ తర్వాత భారత్పై పాకిస్తాన్ దాడి..
పరుగులు పెడుతున్న పసిడి ధరలు..