Cyclone Montha Submerges Warangal: మొంథా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లా ముంచెత్తింది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజల జీవితాలను స్థంభింపజేశాయి. తక్కువ ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగిపోయాయి. శాఖరాసి కుంట, శివనగర్, బీఆర్ నగర్, ఎస్సార్ నగర్, ఎన్టీఆర్ నగర్, కిల్లా వరంగల్ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టగా, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అర్ధరాత్రి వరకు వర్షం కురవడంతో కాలనీలు చెరువుల్లా మారాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి, వైర్లు తెగిపోయాయి, చెట్లు కూలిపోయాయి.
వర్షం ఆగిపోయినా నష్టం మాత్రం ఎక్కువగానే జరిగింది. రోడ్లన్నీ నీటితో నిండిపోయి, నాలాలు ఉప్పొంగిపోతున్నాయి. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ముమ్మరంగా నీటిని మళ్లించే పనులు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు వరంగల్ కలెక్టర్తో సమావేశం నిర్వహించి పరిస్థితిపై సమీక్ష చేయనున్నారు. పంటలకు భారీ నష్టం జరగడంతో, ఐకేపీ కేంద్రాల్లో వడ్లు నానిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై కూడా సీఎం కీలక ఆదేశాలు ఇవ్వనున్నారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రఫేల్ ఫైటర్ జెట్లో గగన విహారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మొంథా తుఫాన్ తీరం దాటింది – ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు
External Links:
వరంగల్ ను ముంచేసిన మొంథా.. నగరమంతా నీళ్లలోనే