Man Buys 1 10 Lakh Hero Splendor Plus: యాదాద్రి భువనగిరి జిల్లా వెలిమినేడుకు చెందిన కొండె రఘుపతి తన పొదుపుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయన రూ.1.10 లక్షల విలువైన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ను పూర్తిగా రూ.10 నాణేలతో కొనుగోలు చేశాడు. స్థానిక శ్రీ వినాయక మోటార్స్ షోరూమ్కు ప్లాస్టిక్ సంచుల్లో నాణేలు తీసుకెళ్లి బైక్ ధర మొత్తాన్ని చెల్లించాడు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షోరూమ్ సిబ్బంది ఒక్కో రూ.10 నాణెాన్ని లెక్కించి మొత్తం రూ.1.10 లక్షలు పూర్తిచేశారు. అనంతరం రఘుపతికి కొత్త బైక్ను అందజేసి అభినందించారు. చిన్న మొత్తాలను క్రమంగా పొదుపు చేస్తే పెద్ద లక్ష్యాలను కూడా చేరుకోవచ్చని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అలాగే అంత పెద్ద మొత్తాన్ని నాణేల రూపంలో స్వీకరించి ఓపికగా లెక్కించిన షోరూమ్ సిబ్బందిని కూడా అభినందిస్తున్నారు. గతంలో ఛత్తీస్గఢ్లో కూడా ఓ రైతు దాచుకున్న నాణేలతో తన కుమార్తెకు స్కూటీ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
తెలంగాణ అంతటా విస్తరించిన రుతుపవనాలు…
External Links:
చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!