Strikes on iran: అమెరికా మరోసారి ఇరాన్పై వైమానిక దాడులు చేసింది. ఇరాన్తో చర్చలు ఇక ప్రయోజనం లేదని, కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు జరిగాయి. టెహ్రాన్తో పాటు సిరిక్, బుషెహర్, కొనరాక్, చబహార్, జాస్క్ ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ట్రంప్ చెప్పారు. ఇరాన్ దాడులు ఆపకపోతే మరింత తీవ్రంగా స్పందిస్తామని కూడా హెచ్చరించారు.
అమెరికా దాడులకు ప్రతిగా బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కువైట్, బహ్రెయిన్, ఖతార్ దేశాలు క్షిపణి హెచ్చరిక సైరన్లను మోగించాయి. ప్రస్తుతం ఈ దేశాల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగినట్లు స్పష్టమైన సమాచారం లేదు. అయితే తమ వైపు వచ్చిన డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంటున్నామని కువైట్ సైన్యం తెలిపింది. ఈ ఘటనలతో పశ్చిమాసియా ప్రాంతంలో మరోసారి యుద్ధ భయం పెరిగింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
మళ్లీ మొదలైన ఇరాన్-అమెరికా యుద్ధం.. కువైట్, బహ్రెయిన్, ఖతార్ దేశాల్లో మోగిన సైరన్లు