NTR's Dragon In Two Parts

NTR’s Dragon In Two Parts: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం హైదరాబాద్, కర్ణాటక ప్రాంతాల్లో కొంత షూటింగ్ కూడా పూర్తయింది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో 31వ సినిమా.

ఇటీవల ఈ సినిమా ఆగిపోయిందని, ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ వదంతులేనని తెలుస్తోంది. దర్శకుడు కథలో కొన్ని మార్పులు చేసి ఎన్టీఆర్‌ను కొత్తగా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తీర్చిదిద్దుతున్నారు. కానీ సలార్‌లా వేర్వేరు సినిమాలుగా కాకుండా, రెండు భాగాలను ఒకేసారి షూట్ చేసి, మొదటి భాగం విడుదలైన నెలలో రెండో భాగాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. మొదట కథ నిడివి ఎక్కువగా ఉండటంతో, దానిని రెండు పార్ట్స్‌గా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

‘మిత్ర మండలి’ రివ్యూ..

‘ఓజీ’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు…

External Links:

ఎన్టీఆర్ – నీల్ ‘డ్రాగన్’ ఒకటి కాదు.. టు పార్ట్స్ గా వస్తున్నాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *