Ravindra Jadeja: చెన్నై సూపర్ కింగ్స్లో చాలాకాలంగా ఆడుతున్న రవీంద్ర జడేజా తాజాగా జట్టును విడిచిపెట్టి రాజస్థాన్ రాయల్స్లో చేరాడు. అలాగే, రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన సంజూ శాంసన్ ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్లో చేరుతున్నాడు. ఈ మార్పులపై ఐపీఎల్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. జడేజా, సంజూ సహా మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లు తమ తమ జట్లను మార్చుకున్నట్లు ప్రకటించింది.
అదే విధంగా, సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన షమీ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు మారాడు. కేకేఆర్ ఆటగాడు మయాంక్ మార్కండే ముంబై ఇండియన్స్లో చేరాడు. ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించిన అర్జున్ టెండుల్కర్ లక్నో సూపర్ జెయింట్స్కు మారాడు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు నితీశ్ రానా ఢిల్లీ క్యాపిటల్స్కు వెళ్లాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు డొనోవాన్ రాజస్థాన్ రాయల్స్కు చేరాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సామ్ కరన్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మారినట్లు ఐపీఎల్ తెలిపింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రఫేల్ ఫైటర్ జెట్లో గగన విహారం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పు – ఎమ్మెల్సీ అజారుద్దీన్కి మంత్రి పదవి దక్కింది