Us Self Defense Strikes: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ ఇరాన్లోని క్షిపణి కేంద్రాలు, ఇరానియన్ నౌకలను లక్ష్యంగా చేసుకుని అమెరికా “ఆత్మరక్షణ దాడులు” నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ పడవలు సముద్రంలో మైన్లు అమర్చడానికి ప్రయత్నిస్తున్నాయని, అలాగే అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులకు సిద్ధమయ్యాయని గుర్తించిన తర్వాత ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా వెల్లడించింది. తమ సైన్యాన్ని రక్షించుకోవడానికే ఈ దాడులు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ దాడుల్లో ఇరాన్కు చెందిన రెండు పడవలు, ఒక క్షిపణి కేంద్రం ధ్వంసమైనట్లు అమెరికా తెలిపింది. అయితే ఈ చర్యలు కాల్పుల విరమణ ఒప్పందానికి ఎలాంటి ముప్పు కాదని కూడా స్పష్టం చేసింది. మరోవైపు హార్ముజ్ జలసంధి సమీపంలోని బందర్ అబ్బాస్, సిరిక్, జాస్క్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తన శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అలాగే పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు.. ఇరాన్పై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులు!