Manmadha Re Release On July 18: శింబు, జ్యోతిక కలిసి నటించిన సూపర్ హిట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను జూలై 18న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నైజాం ప్రాంతాల్లో రీ-రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 2004లో తమిళంలో ‘మన్మధన్’ పేరుతో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత తెలుగులో ‘మన్మధ’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది.
శింబు నటన, కథలోని థ్రిల్లింగ్ మలుపులు, యువన్ శంకర్ రాజా సంగీతం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. అందుకే ఈ చిత్రం ఇప్పటికీ కల్ట్ క్లాసిక్గా అభిమానుల మదిలో నిలిచింది. ఇటీవల రీ-రిలీజ్ అవుతున్న పాత సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో ‘మన్మధ’ కూడా మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి ఏ.జె. మురుగన్ దర్శకత్వం వహించగా, కథ, స్క్రీన్ప్లేను శింబు స్వయంగా అందించారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
శింబు కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.!