Rangasamy Oath In As Puducherry: పుదుచ్చేరి రాజకీయాల్లో రంగస్వామి మరోసారి తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఆయన బుధవారం ఐదోసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్లో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కైలాశనాథన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం రంగస్వామి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పుదుచ్చేరిని సింగపూర్లా అభివృద్ధి చేస్తామని, మౌలిక వసతులు, పర్యాటకం, సంక్షేమంపై దృష్టి పెడతామని చెప్పారు.
నమస్సివాయం కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, కొత్త పథకాలు తీసుకొస్తామని తెలిపారు. మల్లాది కృష్ణరావు కూడా త్వరలో మంత్రివర్గంలో చేరనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఎన్ఆర్ కాంగ్రెస్ 12 స్థానాలు, బీజేపీ 4 స్థానాలు గెలుచుకోగా, డీఎంకే 5 స్థానాలు సాధించింది. అలాగే టీవీకే కూడా రెండు స్థానాలు గెలిచి పుదుచ్చేరిలో ఖాతా తెరిచింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు…
బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబిన్..
External Links:
నేడు అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న హిమంత బిస్వా శర్మ