Ap Cabinet Meeting Today: నేడు అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పెట్టుబడులు, పారిశ్రామిక ప్రాజెక్టులు, భూ కేటాయింపులపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 17వ ఎస్ఐపీబీ ఆమోదించిన రూ.2,01,023 కోట్ల విలువైన 25 ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విశాఖలో రూ.1 లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్, సత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు, కడపలో అదానీ హైడ్రో ఎనర్జీ సంస్థ చేపట్టనున్న రూ.12 వేల కోట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా అనుమతి లభించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ సూచించిన పొదుపు చర్యలపై కూడా సమావేశం తర్వాత చర్చ జరగనుంది. ప్రభుత్వ ఖర్చులు తగ్గించడం, వనరులను సమర్థంగా ఉపయోగించడం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు మంత్రులు, అధికారులకు సూచనలు చేసే అవకాశం ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ