Ap Cabinet Meeting Bc Reservation: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం సుమారు 24.15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉండటంతో, హామీని అమలు చేయాలంటే దాదాపు 10 శాతం పెంచాల్సి ఉంటుంది.
అలాగే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్షంగా ఎన్నుకునే విధానానికి సంబంధించిన బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానంలో మార్పులు తీసుకురావడంలో భాగంగా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకురానుంది. మరికొన్ని కీలక బిల్లులపై కూడా చర్చించడంతో పాటు, అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బిల్లులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తంగా బీసీ రిజర్వేషన్ల పెంపు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, మేయర్, మున్సిపల్ చైర్మన్ల ప్రత్యక్ష ఎన్నికలు ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?