Ap Liquor Transport Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా హైదరాబాద్లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, లెక్కల్లో చూపని నగదు, ఆస్తి పత్రాలు, జాయింట్ వెంచర్ ఒప్పందాలు, ఒక లగ్జరీ కారు మరియు సుమారు రూ.94.5 లక్షల విలువైన ఖరీదైన గడియారాలను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ, వారిని కోర్టులో హాజరుపరచగా జూన్ 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
ఈడీ దర్యాప్తు ప్రకారం, APSBCL లిక్కర్ రవాణా టెండర్ల నిబంధనలను కొందరికి అనుకూలంగా మార్చి, సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ప్రసాద్ ట్రాన్స్పోర్ట్స్ సంస్థలను ఫ్రంట్ కంపెనీలుగా ఉపయోగించినట్లు గుర్తించింది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ప్రధాన కుట్రదారుడిగా పేర్కొంటూ, రాజకీయ ప్రభావంతో టెండర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపించింది. జిల్లా స్థాయి రవాణా రేట్లను భారీగా పెంచి అక్రమ లాభాలు పొందినట్లు, అలాగే ప్రభుత్వ అనుమతి లేకుండానే రాష్ట్రవ్యాప్త కేంద్రీకృత రవాణా విధానాన్ని అమలు చేసినట్లు తెలిపింది. ఈ చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుమారు రూ.195.33 కోట్ల నష్టం జరిగినట్లు ఈడీ అంచనా వేసింది. కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని వెల్లడించింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్…
ది గర్ల్ ఫ్రెండ్.. బాగానే వసూలు చేస్తుందిగా….
External Links:
సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు