Balkampet Yellamma Kalyanam: హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి వార్షిక కళ్యాణ మహోత్సవం ఆషాఢ మాసం తొలి మంగళవారం వైభవంగా జరిగింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరయ్యారు. ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, 11.59 గంటలకు అమ్మవారి దివ్య కళ్యాణం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో బుధవారం రథోత్సవం నిర్వహించనున్నారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, అన్నదానం, తాగునీటి శిబిరాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో 700 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నారు. ప్రత్యేక దర్శన పాసులను కూడా అందుబాటులో ఉంచారు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
నేడు “బల్కంపేట ఎల్లమ్మ తల్లి” వార్షిక కళ్యాణ మహోత్సవం..!