Kondagattu Anjanna Temple: నేడు హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో అంజన్న పెద్ద జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కొండగట్టు కాషాయ వనంగా మారి హనుమాన్ మాలధారులతో నిండిపోయింది. “రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి” నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. చాలామంది కాలినడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
కొండగట్టు అంజన్న క్షేత్రం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో సంజీవని కోసం హనుమంతుడు వెళ్లినప్పుడు పర్వతంలోని ఓ భాగం ఇక్కడ పడిపోయిందని చెబుతారు. ఆ భాగమే కొండగట్టుగా పేరుపొందిందని స్థలపురాణం ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం సంజీవుడు అనే యాదవుడు ఇక్కడ హనుమంతుని దర్శించి ఆలయాన్ని నిర్మించాడని కథనం. ఆ తర్వాత ఈ క్షేత్రం భక్తులకు విశ్వాస కేంద్రంగా మారింది. ఇక్కడ బేతాళ స్వామి క్షేత్రపాలకుడిగా వెలసి ఉన్నారని కూడా నమ్మకం ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు…
ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు..
External Links:
సంజీవని పర్వతం రాలిన చోటు.. కొండగట్టు అంజన్న ఆలయ విశిష్టత మీకు తెలుసా?